Kalvakuntla Kavitha : కవిత ఇష్యూలో కీలక పరిణామం..మూడుగంటలుగా చర్చలు

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితతో బీఆర్‌ఎస్‌ ఎంపీ దామోదర్‌రావు భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలకు పైగా ఆయనతో పాటు గండ్ర మోహన్ రావు కవితతో సమావేశమయ్యారు,

New Update
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha : బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితతో బీఆర్‌ఎస్‌ ఎంపీ దామోదర్‌రావు భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలకు పైగా ఆయన కవితతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు పార్టీ లీగల్‌ సెల్‌ ఇన్‌ఛార్జ్‌ గండ్ర మోహన్‌రావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా కవిత పార్టీ పెడుతుందన్న ప్రచారంతో పార్టీ అధిష్టానం ఆదేశాలతో వారు ఇద్దరూ కవితతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 

Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

Also Read :  BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే

ఇటవల కేసీఆర్‌కు కవిత లేఖ రాయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనంతరం కేసీఆర్‌ దేవుడని, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కామెంట్‌ చేడయం పార్టీలో చర్చకు దారి తీసింది. కాగా కవిత వ్యాఖ్యలు, లేఖ పైన కేసీఆర్‌ స్పందించనప్పటికీ ఆమె పార్టీ పెడుతుందని, ఆమెను పార్టీనుంచి బహిష్కరిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ దశలో పార్టీ ఎంపీ దామోదర్‌ రావు కవితతో సమావేశం కావడం సంచలనంగా మారింది. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : Pawan : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!

Also Read : Cinema News: పవన్‌పై కుట్రతోనే థియేటర్ల మూసివేత.. ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారా!?

Advertisment
Advertisment
తాజా కథనాలు