Kavitha: కవిత సంచలన నిర్ణయం.. ‘స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకుంటాం’

తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని ఆమె హెచ్చరించారు. లోకల్ బాడీ ఎలక్షన్‌లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా గ్రామపంచాయతీ ఎన్నికలకు పోతే ఒక్కో వార్డులో వందల కొద్దీ నామినేషన్లు వేయిస్తామని హెచ్చరించారు.

New Update
MLC Kavitha Vs CM Revanth Reddy

MLC Kavitha Vs CM Revanth Reddy

రాష్ట్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని ఆమె హెచ్చరించారు. లోకల్ బాడీ ఎలక్షన్‌లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా గ్రామపంచాయతీ ఎన్నికలకు పోతే ఒక్కో వార్డులో వందల కొద్దీ నామినేషన్లు వేయిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తోంది. ఈక్రమంలో ఆమె బీసీ రిజర్వేషన్ గురించి లేవనెత్తింది.

Also Read :  ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?

Local Body Elections - Kavitha

Also Read :  తగ్గేదే లే.. రక్తానికి రక్తమే సమాధానం.. ఇరాన్ సంచలన వార్నింగ్

కేంద్ర బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ జాగృతి తరుఫున జులై 16,17,18న రైల్వే రోకోలు నిర్వహిస్తాం. రైల్వే వ్యవస్థను స్తంబింపజేస్తాం. బనక చర్ల ప్రాజెక్ట్ అపాలంటే  ఢిల్లోలో ఉద్యమాలు చేయాలని ఆమె సూచించారు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేసింది. డిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేశారని సెటైర్లు వేశారు. కేటీఆర్‌పై ఏసీబీది టైం పాస్ విచారణ. ఇలాంటి విచారణలు చాలా చూశామని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ అని కవిత స్పష్టం చేశారు. 

Also Read :  పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. మరో బాంబు పేలుడు

Also Read :  మొదలు కానీ 'ఘాటీ' ప్రమోషన్స్! విడుదల వాయిదా?

 

kavitha | local-body-elections | latest-telugu-news | cm revanth on local body elections | telangana local body elections 2025 | local body elections in telangana

Advertisment
Advertisment
తాజా కథనాలు