పాకిస్థాన్కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఓ రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు సంభవించింది. దీంతో ఆ వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళ్తే బుధవారం సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ వద్ద రైలు మార్గంలో ఈ పేలుడు ఘటన జరిగింది. దీంతో అక్కడ మూడు అడుగుల గుంత ఏర్పడింది.
Also Read: ఫైనల్ స్టేజ్లో ఇరాన్ న్యూక్లియర్ బాంబ్.. ఏ క్షణమైనా విధ్వంసం!
ఈ రైలు మార్గంలో ఐఈడీ బాంబు పెట్టడం వల్లే ఈ భారీ పేలుడు సంభవించిందనట్లు తెలుస్తోంది. దీంతో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్లో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటిదాకా ఏ సంస్థ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. బలోచిస్థాన్ వేర్పాటువాదులే ఈ ఘటనకు ఈ బాంబు దాడికి పాల్పడిఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
⚡ Six bogies of Jaffar express plying from Quetta to Peshawar derailed after a blast on a railway track near Jacobabad, Sindh #Pakistan. No casualty reported so far. Train services have been temporarily suspended. pic.twitter.com/sTZkYBxJbf
— Raja Muneeb (@RajaMuneeb) June 18, 2025
Also Read: బద్దలైన అగ్నిపర్వతం.. వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం
ఇదిలాఉండగా ఈ ఏడాది మార్చిలో ఇదే జాఫర్ రైలు హైజాక్ గురైన విషయం తెలిసిందే. అప్పుడు బలోచిస్థాన్ మిలిటెంట్లు ఈ రైలును హైజాక్ చేశారు. అంతేకాదు ఆ రైలులోని వందలాది మందిని బందీలుగా తీసుకొని వెళ్లారు. అనంతరం వాళ్లని రక్షించేందుకు పాక్ సైన్యం రంగంలోకి దిగింది. దీంతో పలువురు పాక్ భద్రతాధికారులు కూడా బలోచ్ మిలిటెంట్ల చేతిలో హతమయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ పెద్దఎత్తున ఆపరేషన్ చేపట్టి బందీలను విడిపించింది.
Also Read: కాల్పుల విరమణలో మీ పాత్రేమిలేదు..ట్రంప్కు ఝలక్ ఇచ్చిన మోదీ