TG Crime : అమెరికాలో కామారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు యువతీ, యువకులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు.

New Update
Kamareddy

Young Man Dies In America

TG Crime: ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు యువతీ, యువకులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు.

Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?

ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు చేసి కన్నవారికి ఉన్న ఊరికి పేరు తేవాలని భావిస్తున్న తెలుగు యువతీ, యువకులు విదేశాలకు వలసవెళుతున్నారు. అమెరికా, యూకే,ఆస్ర్టేలియా, చైనా ఇలా అవకాశాలను బట్టి విదేశాలకు వెళ్తున్న పలువురి అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, దుండగుల చేతుల్లో హత్య, సరదాగా వెళ్లి మృతి చెండటం వంటి సంఘటనలతో కన్నవారికి పుత్రశోకాన్ని మిగుల్చుతున్నారు.  తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన  గోవర్ధన్‌ ఎం.ఎస్‌చదివేందుకు నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు.  చదువు ముగించుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.

Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!

అంతా బాగానే ఉందనుకున్న సమయంలో గోవర్ధన్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. కాగా గోవర్ధన్‌ ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీ డైరెక్టర్‌, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గూల విఠల్‌ కుమారుడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు లండన్‌లో ఉంటున్నాడు. చిన్న కుమారుడు గూల గోవర్ధన్‌ (27) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. గూల గోవర్ధన్‌ ఈ నెల 27న మృతి చెందినట్లు సమాచారం కుబుంబీకులకు వచ్చింది.కాగా గోవర్ధన్‌ మృతితో  బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునగగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  తమ కలల్ని నిజం చేసుకునేందుకు అమెరికా వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అయితే గోవర్ధన్‌ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :  రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

Advertisment
Advertisment
తాజా కథనాలు