Telangana Crime: తెలంగాణలో ఘోరం.. తండ్రిని రోకలిదుడ్డుతో కొట్టికొట్టి చంపిన కూతురు.. తల్లే కారణం..!
నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి నర్సయ్య (54) చెడు వ్యసనాలకు బానిసై తరచూ తల్లి నర్సమ్మతో గొడవ పడుతున్నాడని కూతురు అతడ్ని కొట్టి చంపింది. ఆపై పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం వివరించింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.