విశాఖ పోలీసులకు సవాల్.. బండరాయితో కొట్టి కొట్టి..! | Young Man K*il*led At Visakhapatnam | RTV
ప్రేమించిన అమ్మాయితో ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. మృతున్నితుని మండలం ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన వడ్లమూరి భాను (22) గా గుర్తించారు.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చికాగో మిస్సౌరీ ప్రాంతంలో జరిగింది. ఇతని మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది.
ఓ యువకుడి చేతిలో మరో యువతి బలైంది. పంజాబ్ మొహాలికి చెందిన అమ్మాయి ఆఫీసుకు వెళ్తున్న సమయంలో నడి రోడ్డుపై పబ్లిక్ ముందే ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. తీవ్ర గాయలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. వీడియో వైరల్ అవుతోంది.
ప్రేమపేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమ్మాయిపై దాడి చేసేందుకు ఇంటికొచ్చిన మహేశ్ ను ఆమె కుటుంబసభ్యులు కొట్టి చంపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో జరిగింది.
మెట్రో రైలు ఎక్కడానికి వచ్చిన ఓ రైతును బెంగళూరు మెట్రో సెక్యూరిటీ సూపర్ వైజర్ అడ్డుకున్నాడు. దుస్తులు మురికిగా ఉన్నాయని, అతను రైలు లోపలికి ఎక్కితే తోటి ప్రయాణికులు చిరాకు పడతారని సమాధానం ఇవ్వడంతో ఓ యువకుడు కలగజేసుకుని గొడవకు దిగడంతో రైతుని మెట్రో ఎక్కనిచ్చారు.
స్నేహితుడితో అసహజ శృంగారం కోసం పాకులాడిన ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రమోద్ కుమార్ శుక్లా అనే యువకుడు శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసినందుకు హతమార్చినట్లు బిహార్కు చెందిన రాజేశ్ తెలిపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కరీంనగర్ లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తనతో ప్రేమ, పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో కొత్తపల్లికి చెందిన బొద్దుల సాయి 26ఏళ్ల యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. స్థానికులు అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రూ.5,000 కోసం ఓ యువకుడు తల్లిని గొంతు పిసికి చంపేసిన దారుణమైన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. హిమాన్షు తన తల్లి ప్రతిమా దేవిని హతమార్చి డెడ్ బాడీని ట్రావెల్ బ్యాగ్లో కుక్కి హర్యానా నుంచి త్రివేణి సంగమం నదిలో పడేసేందుకు తీసుకొచ్చాడు. స్థానికులు పోలీసులకు పట్టించారు.