BIG BREAKING: హైదరాబాద్‌లో జంట హత్యల కలకలం.. భార్య, భర్తను గొంతు కోసి!

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో వృద్ధ దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. వారి నివాసంలోనే ఉన్న దంపతులను గొంతుకోసి హతమార్చారు దుర్మార్గులు. మృతులు బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులు షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులుగా పోలీసులు గుర్తించారు.

New Update
Rajendranagar Crime News

Rajendranagar Crime News

HYD Crime: మహానగరం చుట్టు మానవ మృగాలు ఎక్కువయ్యారు. వీళ్లకు ఏం పోయే కాలం వచ్చిందోగాని వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. స్థానిక వివరాల ప్రకారం..  హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధ దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేసి పరారైన ఘటన రాజేంద్రనగర్‌లో కలకలం రేపింది. నివాసంలోనే ఉన్న దంపతులను నిందితులు గొంతుకోసి హతమార్చారు ఈ దుర్మార్గులు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాలను చూసిన స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతులు షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులుగా సమాచారం.

Also Read :  దీపికకు నేనంటే చాలా ఇష్టం.. నాతో రెండేళ్లు తిరిగింది: మాజీ ప్రియుడు సంచలనం!

నిందితులు ఫిజియోథెరపీ నలుగురేనా..?

గృహ ప్రవేశానికి వచ్చిన ఫిజియోథెరపిస్టుల నిఘా ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సమాచారం మేరకు ఫిజియోథెరపీ చేసేందుకు నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చినట్టు సమాచారం ఉంది. అయితే వారు వచ్చిన తరువాత కొన్ని గంటలకే ఈ దారుణం జరగడం అనుమానాలకు తావిస్తోంది. మృతుల గదిలో భయానకంగా రక్తపు మరకలు, పైగా గొంతు చీల్చిన తీరును బట్టి.. ఇది పూర్తిగా ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లోని కొన్ని విలువైన ఆభరణాలు, డబ్బు దోచుకెళ్లినట్లు గుర్తించారు. దోపిడీ కోణంలోనూ కేసును పోలీసులు పరిశీలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ అలవాటును తగ్గిస్తే ఐదు సమస్యలు పరార్

దొంగతనం కోసం దంపతులను హత్య చేశారా? లేక ఇంకేదైనా వ్యక్తిగత ద్వేషం ఉన్నదా? అనే కోణాల్లో పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంటి సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాల ఫుటేజ్‌ ద్వారా నిందితుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుల తీరులో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నా వాటిని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించగా బాధితుల కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. విశ్రాంతి జీవితం గడుపుతున్న ఈ వృద్ధ దంపతులపై ఇటువంటి దారుణానికి పాల్పడడం పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సత్వర స్పందనతో దర్యాప్తు వేగంగా సాగుతోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

(ts-crime | ts-crime-news | crime news | crime | Latest News | telugu-news)

ఇది కూడా చదవండి: ముఖం టానింగ్‌ను తొలగించే స్క్రబ్.. ఈవిధంగా ట్రై చేయండి

Also Read :  భారత్‌లో ఎలన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు పచ్చజెండా

Advertisment
Advertisment
తాజా కథనాలు