/rtv/media/media_files/2025/06/07/5l2MpXRKViMuw2IuDPfo.jpg)
hyderabad jagadgiri gutta fire accident one man died
హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సాయి (27) అనే యువకుడు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తమ కుమారుడు మృతి చెందడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సజీవదహనం అయిన యువకుడు
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ బస్తీలో సాయి (27) అనే యువకుడు తన తల్లిదండ్రులతో నివాసముంటున్నాడు. ఇవాళ సాయి తల్లిదండ్రులు గుడికి వెళ్లారు. అతడు ఇంట్లోనే ఉన్నాడు. అనంతరం వారు తిరిగి వచ్చి చూసే సరికి ఇంట్లో భారీగా మంటలు వ్యాపించి ఉన్నాయి. దట్టమైన నల్లటి పొగ, ఎగసిపడుతున్న మంటలు చూసి వారు భయంతో వణికిపోయి పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
దీంతో హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటల్లో కాలిపోయిన సాయి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే మృతుడు పక్కనే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉండటంతో.. మొబైల్ పేలి షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటి విషాదమే మరొకటి
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. అర్బన్ మండలం ధరూర్లోని స్క్రాప్(తుక్కు) షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన నల్లటి పొగ, భారీగా ఎగసిపడుతున్న మంటలతో చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది.
ఊరు ఊరంతా భయంతో పరుగులు
అనంతరం మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. అంతకంతకు మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో వారికి కూడా కష్టంగా మారింది. అందులోనూ ఆ స్క్రాప్ షాప్ పక్కనే పెట్రోల్ బంక్తో ఒక గృహ సముదాయం ఉంది. దీంతో స్థానికులు మరింత భయంతో వణికిపోతున్నారు. నల్లటి పొగ కారణంగా ధరూర్ గ్రామం మొత్తం చిమ్మచీకటిని తలపించింది.
Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
ఈ ప్రమాదానికి అసలు కారణం ఒకటుంది. స్క్రాప్ షాప్కు పక్కనే ఉన్న శ్మశానంలో ఓ వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం గాలి విపరీతంగా వీయడంతో దాని నుంచి వచ్చిన నిప్పురవ్వలు స్క్రాప్ షాప్లో పడ్డాయి. దీని కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది అని సమీప సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.