/rtv/media/media_files/2025/04/27/RBOdzRYd4lqrk2eYAn5f.jpg)
Heavy rains in Telangana.
రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. జూన్ 17 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు.
ఎల్లో అలర్ట్
భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
అటు ఢిల్లీలో కూడా ఆదివారం రాత్రి వర్షం కురవడం మొదలైంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. తెల్లవారుజామున ఢిల్లీలో భారీ వర్షం, తుఫానులు సంభవించింది. గాలి వేగం గంటకు 50 నుంచి 104 కి.మీ.ల మధ్య ఉంది. ఇది నిన్న మొన్న ఎండ తీవ్రతల నుంచి ప్రజలకు నుండి ఉపశమనం కలిగించింది. ఈ వర్షం ఢిల్లీ అంతటా ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది.
#WATCH | Delhi | Heavy rain accompanied by strong winds lashes national capital, bringing respite from heat.
— ANI (@ANI) June 14, 2025
(Visuals from Shastri Bhawan) pic.twitter.com/6Qd7nwMN5H