Harish Rao :  కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలివే...హరీశ్‌రావు సంచలన ప్రజేంటేషన్‌

కాళేశ్వరం పై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం- -వాస్తవాలు’ అనే అంశంపై వివరించారు. 

New Update
Harish Rao PowerPoint Presentation

Harish Rao PowerPoint Presentation on Kaleshwaram

Harish Rao :   కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం- -వాస్తవాలు’ అనే అంశంపై వివరించారు. 

కాళేశ్వరం అంటే ఏంటో హరీశ్‌రావు ముందు వివరించారు. కాళేశ్వరం అనేది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌ స్టేషన్లు, 21 పంప్‌ హైజ్‌లు, 203 కిలో మీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్‌ , 98 కిలోమీటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్‌, 240 టీఎంసీల నీటి వినియోగం అని తేల్చి చెప్పారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేది.కానీ, కేసీఆర్ ముందు చూపుతో  కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని హరీశ్‌రావు వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండం చెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 నీటి నిల్వ సామర్ధ్యం ఉంది. ఒక్క మల్లన్న సాగర్ లోనే 50 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందని తెలిపారు.

Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్

ఎస్సారెస్పీకి నీళ్లు రానపుడు, కడెం నిండకున్నా ఎల్లంపల్లికి కూడా  నీళ్లు రానపుడు, మేడిగడ్డలో నీళ్లుంటాయి. ఎక్కడా నీళ్లు లేనపుడు కూడా  నీళ్లు లభ్యమయ్యే పాయింట్ మేడిగడ్డ. వర్షాలు బాగా కురిసినపుడు ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నం. మిడ్ మానేర్ లో పంప్ చేసి అక్కడి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు నీళ్లు తెచ్చుకున్నామన్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన వీటి అంతటా లక్షల ఎకరాల్లో పంటలు పండినయి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్లొచ్చినయి. అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో  రంగనాయక సాగర్ కు నీళ్లొచ్చినయి.రంగనాయక సాగర్ మోటార్లతో మిడ్ మానేర్ కు నీళ్లొచ్చినయి.మిడ్ మానేర్ మోటార్లతో మల్లన్నసాగర్ కు, అక్కడి మోటార్లతో    కొండ పోచమ్మ సాగర్ కు నీళ్లొచ్చినయి. ఇదంతా కాళేశ్వరంలో భాగంగానే.. వ్యవస్థ అంతా పనిచేయడం వల్లనే లక్షల ఎకరాల్లో పంట పండింది. కాళేశ్వరం కింద ఒక్క ఎకరా పారలేదు అంటడు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, 50 వేల ఎకరాలు మాత్రమే సాగయింది అంటడు. ఇంకో కాంగ్రెస్ నాయకుడేమో లక్ష ఎకరాలే పారింది అంటడు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు,  ఒక్కో నాయకుడు ఒక్కో లెక్క చెబుతడు. కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిందని హరీశ్‌రావు వివరించారు.

ఇది కూడా చదవండి: వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2 మరియు నిజాంసాగర్ నీటితో నింపిన 2143 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1 లక్షా 67 వేల కొత్త ఆయకట్టు సాగయింది. ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2 మరియు నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరందించి 17 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది. కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20 వేల 576 ఎకరాలకు సాగునీరందిందని హరీశ్‌ రావు వివరించారు.

Also Read: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం..  తల్లీబిడ్డకు ప్రాణం పోసిన ప్రైవేట్ హాస్పిటల్

దీనికి తర్వాత పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై  దుష్ప్రచారం చేస్తున్నారని  ఆయన ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం చేశామన్న ఆయన నీళ్ల విషయంలో దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పటికీ కూడా అదే అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో అన్నీ దందాలు.. చందాలేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.  మేడిగడ్డ బ్యారేజ్‌ రెండు పిల్లర్లలో మాత్రమే పగుళ్లు వస్తే.. ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందన్నట్లుగా కాంగ్రెస్ నేతలు, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కై కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు హక్కు దక్కాలంటే శ్రీరామరక్ష కేసీఆరే అని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్‌ పేరిట ప్రభుత్వం నాటకాలాడుతోందని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు వెంటనే రిపేర్లు చేసి నీళ్లివ్వాలని తాము  ఎన్నిసార్లు కోరినా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Also Read: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్‌లైన్‌లో రూ.3.85 కోట్లు స్వాహా

Advertisment
Advertisment
తాజా కథనాలు