/rtv/media/media_files/2025/04/26/Yb7vsoov4Qosw4xFNdF9.jpg)
Indus Waters Treaty
Indus Water Treaty Dispute: పహల్గాం దాడి(Pahalgam Attack) తరువాత భారత్, పాకిస్తాన్(India vs Pakistan) మధ్య దౌత్య సంబంధాలు చెడిపోయాయి. ఈ కారణంగా భారత్..పాక్ కు సింధు జలాల ను ఆపేసింది. ఈ కారణంగా ప్రస్తుతం ఆ దేశం కరువు ఎదుర్కొంటోంది. అందుకే ఈ నిర్ణయాన్ని పున:పరీశించాలని భారత్ను అభ్యర్థిస్తూ పాకిస్తాన్ ఒకదాని తర్వాత ఒకటి నాలుగు లేఖలు రాసిందని చెబుతున్నారు. సింధు జలాల ఒప్పందం(Indus Waters Treaty) నిలిపివేతతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అందుకే భారత్ తో కాళ్ళ బేరానికి వస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి అధికారికంగా ఒకటి కాదు ఏకంగా నాలుగు లేఖలు(Pakistan Letter to India) రాసిందని చెబుతున్నారు.చర్చలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సున్నితమైన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అభ్యర్థించారు. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సృష్టిస్తుందని పాక్ భారత్ కు తెలిపింది.
Also Read: ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాకిస్తాన్కు అదే గుర్తువస్తుంది: PM మోదీ
ఉగ్రవాదం ఆగే వరకు నీళ్ళిచ్చేదే లేదు..
అయితే పాకిస్తాన్ ఎన్ని లేఖలు రాసినా భారత ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని మోదీ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. యుద్ధం ఆపేసినా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించాలనే భారత్ అనుకుంటోంది. ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయే వరకు పాక్ ను కట్టడి చేయాలని అనుకుంటోంది. అందుకనే సింధుజలాల ఒప్పందం విషయంలో తగ్గడం లేదని చెబుతున్నారు.
Also Read: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్లైన్లో రూ.3.85 కోట్లు స్వాహా
Also Read: Elon Musk: ద అమెరికన్ పార్టీ.. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు ఇదే..