/rtv/media/media_files/2025/06/06/1UCRK22gdgPOmrdVY1EK.jpg)
ప్రసవం చేయాలని ప్రభుత్వం హాస్పిటల్కు వెళ్తే.. బిడ్డ చనిపోయిందని చెప్పారు వైద్యులు. కాన్పు చేసేందుకు నిరాకరించారు. దీంతో వెంటనే ఆ మహిళను కుటుంబసభ్యుల ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు మహిళకు డెలివరీ చేయగా.. ఆరోగ్యంగా ఉన్న పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించారు. జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 4న చల్కుషా బ్లాక్కు చెందిన నిండు గర్భిణీ మనిషా దేవికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో భర్తతో కలిసి 120 కిలోమీటర్లు ప్రయాణించి షేక్ భిఖారి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు వెళ్లారు.
మనిషా దేవిని అడ్మిట్ చేసుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. ఆమె హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని, గర్భంలోని పిండం అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే ఇది నమ్మని భర్త వినోద్ తన భార్యను సమీపంలోని సెయింట్ కొలంబా మిషన్ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించాడు. మెడికల్ టెస్టులు నిర్వహించిన అక్కడి డాక్టర్లు మనిషా దేవి రిపోర్టులన్నీ బాగానే ఉన్నాయని నిర్ధారించారు. ఆమెకు కాన్పు చేయడంతో పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న హజారీబాగ్ డిప్యూటీ కమిషనర్, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ను ఆదేశించారు.