బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. విద్యలో మార్పు అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ చూపించడం మార్పా అని ప్రశ్నించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రణాళిక ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని మాజీ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. పాత సిలబసే ఉంటుందా, కొత్త సిలబస్ ఉంటుందాని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. కేసీఆర్ పెట్టిన గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరారు. వారిని అభినందించిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలన్నారు ఆమె. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణాలకి రూ.85 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అంచనా వ్యయం ఎందుకు మార్చారని అన్నారు.
కవిత ఇష్యూపై పార్టీ కచ్చితంగా స్పందిస్తుంది
ప్రతిరోజు ఉదయం వినాయక పూజ చేసినట్లు ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్లో కేసీఆర్ జపం చేస్తున్నారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇస్తామన్న ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కవిత ఇష్యూపై మాట్లాడమని రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు.. కవిత విషయంలో కచ్చితంగా పార్టీ స్పందిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
sabitha-indra-reddy | brs | pragathi-bhavan | kavitha | brs mlc kavitha | telangana | Young India Integrated School | congress party news | latest-telugu-news