వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అత్త అడ్డువస్తుందనే కారణంతో కోడలు ఆమెకు విషం కలిపిన కూల్డ్రింగ్ ఇచ్చింది. దీంతో చికిత్స పొందుతూ అత్త మరణించడం కలకలం రేపుతోంది. తన తల్లిని భార్య చంపిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పర్వతగిరి మండలం పెద్దతండాలో భూక్య మంజుల, దేవేందర్ దంపతులు నివసిస్తున్నారు.
Also Read: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి తప్పిన ప్రమాదం
Extra Marital Affair
అయితే పెరుకవాడకు చెందిన సారయ్య అనే వ్యక్తితో.. మంజుల మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చివరికి ఈ విషయం ఆమె అత్తయ్య భూక్య గమ్మి(55)కి తెలిసింది. దీంతో పలుమార్లు అత్త కోడళ్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. గతంలోనే రెండుసార్లు అత్త తలపై మంజుల గాయం చేసింది. మరోసారి చేయి కూడా విరగ్గొట్టింది. గొడవలు తీవ్రమవ్వడంతో డిసెంబర్ 3న మంజుల తన అత్త గమ్మికి థమ్సప్ కూల్డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగించేలా చేసింది.
Also Read : 2024లో లాంచ్ అయిన కిర్రాక్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు.. మొత్తం ఎన్నంటే?
దీంతో కొద్దిసేపటి తర్వాత గమ్మి కిందపడి కొట్టుకుంటోంది. ఆమెను చూసిన కొడుకు దేవేందర్ స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించాడు. డాక్టర్ సూచన మేరకు తొలుత తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వరంగల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మళ్లీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా శుక్రవారం సాయంత్రం గమ్మి మృతి చెందింది. కొడుకు దేవేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!
Also Read: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం