వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ మండిపడ్డారు. '' కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు ఎన్నో చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు ఎన్నో హామీలిచ్చారు. మేము పింఛను రూ.2 వేలు ఇస్తే.. కాంగ్రెస్ వాళ్లు రూ.4 వేలు ఇస్తామన్నారు. ఇచ్చారా ?. మేము రైతు బంధు రూ.10 వేలు ఇస్తే.. వాళ్లు రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇచ్చారా ?.
Also Read: రేవంత్ పేరు పలకని కేసీఆర్.. కారణం అదేనా?
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
KCR Questions On Revanth Govt Schemes
చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా?. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేశారా ?. కల్యాణలక్ష్మీ స్కీమ్తో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చారా ?. ఇప్పటికీ కూడా పించన్లు ఏమాత్రం పెరగలేదు. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఎన్నో హామీలిచ్చి ప్రజలను తప్పుదారి పట్టించారు. ఉచిత బస్సులు పెట్టి మహిళలు జుట్లు పట్టుకొనే పరిస్థితి తీసుకొచ్చారు. 2014 కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయంటూ'' కేసీఆర్ ధ్వజమెత్తారు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
telugu-news | congress | rtv-news