ENC Bhookya Hari Ram : కాళేశ్వరాన్ని ముంచి..అక్రమ ఆస్తులు పెంచి...ఈఎన్సీ హరిరామ్ అక్రమ ఆస్తులు రూ.200 కోట్ల పైనే...

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీటిపారుదల శాఖ గజ్వేల్‌ ఈఎన్‌సీ భుక్యా హరిరామ్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. శనివారం రాత్రి వరకూ గుర్తించిన అక్రమాస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.

New Update
Kaleshwaram ENC Hariram

Kaleshwaram ENC Hariram

 ENC Bhookya Hari Ram : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీటిపారుదల శాఖ గజ్వేల్‌ ఈఎన్‌సీ భుక్యా హరిరామ్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టిన ఏసీబీ.. సాయంత్రం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం రాత్రి వరకూ గుర్తించిన అక్రమాస్తుల విలువ సుమారు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.  అనంతరం పోలీసులు ఆయనను అర్ధరాత్రి సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. రూ. 200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

హరి రామ్ ఇంటితోపాటు ఏకకాలంలో బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో 14 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. గజ్వేల్‌లో భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. మార్కుర్‌లో 28 ఎకరాల భూమి, కొండాపూర్ షేక్స్‌పేట్, శ్రీనగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, ఆరెకరాల మామిడి తోట, ఫామ్ హౌస్‌ను గుర్తించారు. అక్రమ సంపాదనతో భారీగా విల్లాలు,స్థలాలు, వ్యవసాయ భూమలు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. కొండాపూర్, నార్సింగి,షేక్‌పేట్‌, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్‌లో మొత్తం 5 ఫ్లాట్లు ఉన్నట్లు తెల్చారు.--- ఏపీ రాజధాని అమరావతిలోనూ భూముల కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.పటాన్ చెరువులో 20 గుంటల భూమి, ఆరెకరాల మామిడి తోట, ఫామ్ హౌస్‌ను గుర్తించారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

బొమ్మలరామారంలో ఆరు ఎకరాలలో ఫామ్‌హౌస్‌, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్‌, మిర్యాలగూడలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇక, బీఎండబ్ల్యూ సహా రెండు కార్లు, ఉన్నాయి. ఇవే కాక, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను కూడా గుర్తించారు. ఆయా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో భారీగా ఉంటుందని పేర్కొంది. హరిరామ్‌ ఆస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశముందని ఏసీబీ పేర్కొంది. కాగా, హైదరాబాద్‌, షేక్‌పేటలోని ఆదిత్య టవర్స్‌లో హరిరామ్‌ నివసిస్తున్న ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. అక్కడి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లను పరిశీలించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

హరిరామ్‌ భార్య అనిత ఇరిగేషన్‌ విభాగంలో డిప్యూటీ ఈఎన్‌సీగా పనిచేస్తున్నారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఎదురుగడ్డ గ్రామం.. హరిరామ్‌ స్వగ్రామం. ఎదురగడ్డలోని హరిరామ్‌ నివాసంతోపాటు ఆయన బంధువుల ఇంట్లో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్‌ ఆధ్వర్యంలోని బృందం సోదాలు చేసింది. నిజానికి, ఏసీబీ దాడులు జరుగుతాయనే సమాచారం చాలా రోజుల నుంచే ఉండడంతో హరిరామ్‌ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారని, చాలా ఆస్తులు బినామీల పేర్లతో పెట్టారని సమాచారం.

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

హరిరామ్ ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్‌‌‌‌ ఈఎన్సీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య అనిత ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో డిప్యూటీ ఈఎన్సీగా, వాలంతరిలో డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌‌‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరిరామ్‌‌‌‌ కీలకపాత్ర పోషించారు. తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి సీఈగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత కాళేశ్వరం సీఈగా కొన్నాళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో మూడు బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సైట్ మార్పులు ఆయన సీఈగా ఉన్నప్పుడే జరిగినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు కీలక అనుమతులు సాధించడంలోనూ ఆయనది కీలక పాత్ర . ఆ తర్వాత ఆయన్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ ఈఎన్సీగా ప్రమోట్ చేసింది.

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

ప్రస్తుతం గజ్వేల్ ఈఎన్సీగా ఉన్న ఆయన పరిధిలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 10 నుంచి 16 వరకు ఆయన పరిధిలోనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక అవసరాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌‌‌‌కు ఎండీగా కూడా ఆయనే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆయన ఎండీగా నియామకం కాగా.. ప్రాజెక్టుకు సంబంధించిన రుణాల వ్యవహారాల్లోనూ ఎండీగా ఆయన కీలకంగా వ్యవహరించారు.

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
తాజా కథనాలు