Temples : దేవాలయాలకు పోటెత్తిన భక్తులు..వేలాదిగా జనం రావడంతో...

వరుసగా రెండురోజులు సెలవులు రావడంతో రెండు రాష్ట్రాల్లోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో దేవాలయాలు జనసందోహంగా మారాయి. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

New Update
Temples

Temples

Temples :వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో రెండు రాష్ట్రాల్లోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో దేవాలయాలు జనసందోహంగా మారాయి. అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Also Read: 'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!.


వేసవి సెలవుల్లో  తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మే 15 నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగింది.  దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడంతో అభిషేక సేవ నిర్వహించే రోజుల్లోనూ ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి శుక్రవారం అభిషేక సేవలు నిర్వహిస్తుంటారు. దీనివల్ల దర్శన సమయం 3 గంటలకుపైగా తగ్గుతుంది. దీంతో ఆ రోజు 60 వేల నుంచి 65 వేల మందే శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. అయితే..టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సిబ్బంది సమన్వయం వల్ల మే, జూన్‌లలోని ప్రతి శుక్రవారం కూడా  గతంలో కన్నా సుమారు 10 వేల మంది భక్తులు అదనంగా దర్శించుకోగలిగారు. కాగా శని,ఆదివారాలు సెలవులు రావడంతో ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Also Read: ఇచ్చిన అప్పు అడిగితే జైలుశిక్ష, రూ.5లక్షలు జరిమాన

  భద్రాచలంలో భక్తుల రద్దీ..

ఇక కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం భక్తుల రద్దీతో కళకళలాడింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం కోసం కేటాయించిన క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం కావడంతో ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి ఆలయ అర్చకులు విశేష అభిషేకం నిర్వహించారు. స్వామివారికి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. రద్దీ పెరగడంతో నిత్య కల్యాణ వేడుకను చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. నిత్య కల్యాణ వేడుకలో ఉభయ దాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరిలో స్నానాలు చేసిన భక్తులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. 

Also Read: ఏపీలో దారుణం.. తమ్ముణ్ణి వేట కొడవలితో నరికి చంపిన అన్న


యాదగిరిలో జన సందోహం

శని,ఆదివారాలు సెలవులు రావడంతో యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. శనివారం పెద్ద మొత్తంలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేయగా, ఆదివారం కూడా ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. వారాంతం కావడంతో రాష్ర్టం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. తెల్లవారు జామునుంచే దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రసాదం కౌంటర్ల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. క్యూలైన్లలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనమిచ్చారు.

Also Read: మణిపూర్‌ వెపన్స్‌ ఆఫరేషన్‌..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం

Advertisment
Advertisment
తాజా కథనాలు