Rahul Gandhi: 'ట్రంప్‌కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. నరేందర్‌.. సరెండర్ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని సెటైర్లు వేశారు.

New Update
Rahul gandhi

Rahul gandhi

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన పార్టీ కన్వెన్షలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు.   

Also Read: ఇకనుంచి ఒకటవ తరగతి నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ !

ఈ సందర్భంగా మాట్లాడుతూ''  ఆపరేషన్ సిందూర్‌ ప్రారంభం అయిన తర్వాత ట్రంప్ ప్రధాని మోదీకి కాల్‌ చేశారు. మోదీజీ .. ఏం చేస్తున్నారు అంటూ ట్రంప్ అడిగారు.  నరేందర్‌. సరెండర్ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా మోదీ పాటించారు.ఇందిరా గాంధీ హయాంలో అమెరికా బెదిరింపులు కూడా లెక్కచేయకుండా పాకిస్థాన్‌ను భారత్‌ ఓడించింది. అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడింది. గాంధీ, నెహ్రూ, సర్దాబ్‌ పటేల్ వీళ్లందరూ కూడా అగ్రరాజ్యలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే అని'' రాహుల్ గాంధీ అన్నారు. 

Also Read: యుద్ధాల్లో దుమ్ము రేపుతోన్న డ్రోన్లు.. వేల కి.మీ దాటి శత్రువులపై దాడులు

ఇదిలాఉండగా మరోవైపు నీటి పంపకాలపై భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్‌కు నీళ్లు వదలకుండా సిందూ నదీ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై చైనా ఇండియాని హెచ్చరించింది. బ్రహ్మపుత్ర నదీ జలాలు భారత్‌లోకి రాకుండా అడ్డుకుంటామని చైనా బెదిరిస్తుంది. పాకిస్థాన్‌కు మద్దతుగా చైనా రంగంలోకి దిగింది. సెంటర్‌ ఫర్‌ చైనా అండ్‌ గ్లోలైజేషన్‌ ఉపాధ్యక్షుడు విక్టర్‌ జికాయ్‌ గవో పాక్‌కు సింధూ జలాల నిలిపివేత పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు నీరు ఇవ్వకుండా భారత్‌ అడ్డుకుంటే.. చైనా కూడా భారత్‌‌కు నీళ్ల రాకుండా అడ్డుకోగలదని విక్టర్‌ జికాయ్‌ గవో అన్నాడు. సిందూ నదీ జలాల ఒప్పందాన్ని మళ్లీ ప్రారంభించి పాకిస్తాన్‌కు నీళ్లు ఇప్పించాలని చైనా ప్రయత్నిస్తోంది. 

 telugu-news | rtv-news | national-news | Rahul Gandhi | operation Sindoor | trump

Advertisment
Advertisment
తాజా కథనాలు