/rtv/media/media_files/2025/02/15/Fm8sKYM6dPc3mlzpTMZY.jpg)
CM Revanth Delhi Tour
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఓ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ బీసీ కాదనే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే తాజాగా దీనిపై సీఎం స్పందించారు. ప్రధానిని తాను వ్యక్తిగతంగా తిట్టలేదని.. పుట్టకతో ఆయన బీసీ కాదని మాత్రమే చెప్పానని తెలిపారు. పుట్టుకతో బీసీ కాదు కాబట్టే బీసీలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. తన మాటలను కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని విమర్శలు చేశారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయించాలని అన్నారు.
Also Read: మోనాలిసా రేంజ్ మారింది.. మాల్ ఓపెనింగ్ లో డాన్సులతో సందడి.. వీడియో చూశారా!
మరోవైపు తెలంగాణలో కులగణన దేశానికే రోడ్మ్యా్ప్ అని రేవంత్ అన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన దాదాపు గంట సేపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. అయితే కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత రేవంత్ మీడియా మాట్లాడారు. '' కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ రోల్ మోడల్.
Also Read: అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్.. శీష్మహల్ విచారణకు ఆదేశం
రాహుల్ గాంధీ చెప్పింది నేను కచ్చితంగా చేస్తాను. కులగణనలో వచ్చిన వివరాల ఆధారంగా కమిషన్ లేదా కమిటీ వేసి ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దానిపై కసరత్తులు చేస్తాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఇచ్చే ఉత్తర్వులను పాటిస్తామని'' సీఎం రేవంత్ అన్నారు. ఇదిలాఉండగా ఇటీవల జరిగిన కులగణనలో తప్పుడు లెక్కలు చూపించారని బీఆర్ఎస్ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ మాత్రం దీన్ని ఖండించారు. తాము సమగ్రంగానే కులగణన నిర్వహించినట్లు తేల్చిచెప్పారు.
Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!
Also Read: మోదీ మాటలకే పరిమితం.. AI విషయంలో ఫెయిల్: రాహుల్ గాంధీ