/rtv/media/media_files/2025/06/28/pubg-wife-2025-06-28-08-00-12.jpg)
Pubg Wife
ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ PUBG గేమ్ ఆడుతున్నప్పుడు పంజాబ్కు చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది. అనంతరం తన కొడుకును హింసించింది. భర్తను 55 ముక్కలుగా నరుకుతానని బెదిరించింది. దీంతో భయపడిన ఆ భర్త.. తన భార్యను ఆమె ప్రేమించిన ప్రియుడితో వెళ్ళనిచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!
55 ముక్కలు నరుకుతా
మహోబా జిల్లాకు చెందిన శిలు రాయ్క్వార్కు 2022 లో బందా జిల్లాలోని మాతాంధ్కు చెందిన ఆరాధనతో వివాహం అయింది. వీరికి ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. శిలు వృత్తిరీత్యా స్వీట్లు తయారు చేస్తుంటాడు. ఆరాధన ఇంటివద్దే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె PUBG మొబైల్ గేమ్కు బానిసైంది.
Also Read: కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
Also Read : జపాన్లో ‘ట్విటర్ కిల్లర్’ కు ఉరి
ఈ సమయంలో ఆరాధనకు పంజాబ్లోని లూథియానాకు చెందిన శివం అనే యువకుడితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి భార్య ఆరాధన తన భర్త నుండి దూరం కావడం ప్రారంభించింది. దీంతో ఇద్దరికీ తరచూ గొడవలు జరిగాయి. ఇది కాస్త వైలెంట్గా మారడంతో ఆరాధన తన భర్తకు వార్నింగ్ ఇచ్చింది.
#Mahoba
— News1India (@News1IndiaTweet) June 26, 2025
एक हजार किलोमीटर दूर से शादी शुदा प्रेमिका के पास पहुंचा प्रेमी
ऑनलाइन गेम पब्जी खेलने के दौरान हुई थी दोनों की मुलाकात
शादी के 3 साल बाद बच्चे और पति को छोड़कर प्रेमी के साथ जाने की जिद पर अड़ी प्रेमिका
प्रेमिका के पति की शिकायत पर पुलिस ने प्रेमी के खिलाफ क़ी… pic.twitter.com/aHjDsbnRy0
భర్తను 55 ముక్కలుగా నరికి డ్రమ్ లో నింపుతానని బెదిరించింది. తన ప్రేమకు అడ్డుగా మారితే చంపేస్తానని హెచ్చరించింది. ఇక తన భర్త పదే పదే కొడుతున్నాడని తన ప్రియుడు శివంకి చెప్పడంతో అతడు ఏకంగా ఇంటికి వచ్చి గొడవ చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక భర్త శిలు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే పోలీసులు శివంపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం తనకు భర్త, కొడుకు వద్దని.. తాను ప్రియుడితో వెళ్లిపోతానని ఆరాధన చెప్పడంతో భర్త శిలు దానికి ఒప్పుకొని వారిని వెళ్లిపోనిచ్చాడు.