సొంతపార్టీపై మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన బీఆర్ఎస్ నాయకురాలు కవిత మాట్లాడింది వందశాతం నిజమేనని అన్నారు. ఆమె జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయాలని ఆ పార్టీ రాయబారు కొందరు వచ్చారని కవిత అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారని గురువారం మీడియతో కవిత అన్నారు. అది నిజమేనని గోషామహల్ ఎమ్మెల్యే సమర్థించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది బీఆర్ఎస్ నేతలేనని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. గతంలో బీఆర్ఎస్ కారణంగానే బీజేపీ ఓడిపోయిందని ఆయన అన్నారు. ప్రతీ ఎన్నికల్లో BRSతో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని రాజాసింగ్ ఆరోపించారు. బీజేపీ తెలంగాణలో ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ.. బీజేపీ రాష్ట్రంలో ఎందుకు గెలవట్లేదో ప్రతీ కార్యకర్తకు తెలుసని ఆయన అన్నారు. నిజాలు బయటకు మాట్లాడితే సస్పెండ్ చేస్తారనే భయంతో ఎవరూ మాట్లాడటం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
bjp-mla-rajasingh | kavitha | brs-mlc-kavitha | brs-mlc-kavitha-slams-bjp | bjp | telangana | latest-telugu-news