బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు(bc reservations issue) కల్పించాలని రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించామని, కానీ కేంద్రం ఆమోదించకుండా అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం… దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించామన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించాం.కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా తేల్చాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపాం కానీ, కేంద్రం ఆమోదించకుండా అన్యాయం చేస్తోందన్నారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది. అందుకే చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపితే.. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. 5 నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బహుజనుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ ఆ ధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, మోదీ కాదా?మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేదు..ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు? అని రేవంత్ప్రశ్నించారు.నాగ్ పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో బీసీలలో ముస్లింలకు రిజర్వేషన్లను తొలగించగలరా? 56 ఏళ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయి. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Also Read : కూకట్పల్లిలో దారుణం..12 ఏళ్ల బాలిక దారుణ హత్య
BJP Blocking BC Reservation - Revanth Reddy
ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను మైనింగ్ పేరుతో చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. ఆనాడు కోటపైకి వెళ్లి చూసి కోటను కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పామన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది.ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం అన్నారు.రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం… దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించామన్నారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై కోపం ఉంటే ఆయనపై చూపండి.. ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం మా బాధ్యత సమస్య వచ్చినపుడు పోరాడేందుకు మీ నైతిక మద్దతు ఉండాలి. విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుంది. మీకు నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది. విగ్రహాలు వర్థంతులు, జయంతుల కోసం కాదు.. వారి స్ఫూర్తిని రగిలించిందుకే అని తెలిపారు. అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు.మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, రాహుల్ గాంధీది అని తెలిపారు.
దొంగ ఓట్లతో, కుట్రలు కుతంత్రాల ద్వారా కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది. అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారన్నారు.దొంగ ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది.బీహార్ లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ గారు బయటపెట్టారు. తప్పు చేసినవారిని వదిలేసి…తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోందని, ఇది ఎంతవరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు.ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో నేను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇస్తాం. అక్కడే కాదు.. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదామని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: సబితా ఇంద్రారెడ్డి బిగ్ షాక్...హైకోర్టు నోటీసులు
Revanth Reddy : బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటున్నది బీజేపీనే : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించామని, కానీ కేంద్రం ఆమోదించకుండా అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana CM Revanth Reddy
బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు(bc reservations issue) కల్పించాలని రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించామని, కానీ కేంద్రం ఆమోదించకుండా అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం… దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించామన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించాం.కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా తేల్చాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపాం కానీ, కేంద్రం ఆమోదించకుండా అన్యాయం చేస్తోందన్నారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది. అందుకే చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపితే.. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. 5 నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బహుజనుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ ఆ ధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, మోదీ కాదా?మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేదు..ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు? అని రేవంత్ప్రశ్నించారు.నాగ్ పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో బీసీలలో ముస్లింలకు రిజర్వేషన్లను తొలగించగలరా? 56 ఏళ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయి. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Also Read : కూకట్పల్లిలో దారుణం..12 ఏళ్ల బాలిక దారుణ హత్య
BJP Blocking BC Reservation - Revanth Reddy
ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను మైనింగ్ పేరుతో చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. ఆనాడు కోటపైకి వెళ్లి చూసి కోటను కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పామన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది.ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం అన్నారు.రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం… దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించామన్నారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై కోపం ఉంటే ఆయనపై చూపండి.. ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం మా బాధ్యత సమస్య వచ్చినపుడు పోరాడేందుకు మీ నైతిక మద్దతు ఉండాలి. విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుంది. మీకు నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది. విగ్రహాలు వర్థంతులు, జయంతుల కోసం కాదు.. వారి స్ఫూర్తిని రగిలించిందుకే అని తెలిపారు. అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు.మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, రాహుల్ గాంధీది అని తెలిపారు.
దొంగ ఓట్లతో, కుట్రలు కుతంత్రాల ద్వారా కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది. అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారన్నారు.దొంగ ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది.బీహార్ లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ గారు బయటపెట్టారు. తప్పు చేసినవారిని వదిలేసి…తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోందని, ఇది ఎంతవరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు.ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో నేను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇస్తాం. అక్కడే కాదు.. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదామని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: సబితా ఇంద్రారెడ్డి బిగ్ షాక్...హైకోర్టు నోటీసులు