/rtv/media/media_files/ZRcSPhwAsxcD39RSb9Xj.jpg)
TG Crime : అతనో పోలీస్ కానిస్టేబుల్...కానీ, డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపాడు. రూ. కోట్ల విలువైన డ్రగ్స్ను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ ను తరలిస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్లోని కూకట్పల్లిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కూకట్పల్లికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమారం అందటంతో పోలీపులు రైడ్ చేసి వారిని పట్టుకున్నారు. పట్టుబడిన ఆరుగురిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. అతని వద్ద నుండి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఓటీ అధికారులు తెలిపారు.
పట్టుబడిన ఆరుగురిలో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40), తిరుపతి రూరల్కు చెందిన ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లాకు చెందిన దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి (38), అద్దంకి మండలానికి చెందిన చెగుడు మెర్సీ మార్గరెట్(34), షేక్ మస్తాన్ వలీ(40), దేవరాజు యేసుబాబు(29) తదితరులున్నారు.
Also Read: ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టి.. కాళ్లు పట్టుకున్న మహిళ - వీడియో వైరల్
వీరంతా కలిసి గత కొంత కాలంగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా పట్టుబడ్డ ముఠా సభ్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రగ్స్ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వారు డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తు్న్నారు. ఎవరెవరికీ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పట్టుబడటం ప్రస్తుతం సంచలనంగా మారింది.