/rtv/media/media_files/2025/06/02/7vMAzEId0wu1XIlCeHvA.jpg)
bengaluru woman hits auto driver with slipper Video Viral
బెంగళూరులో ఓ మహిళ రెచ్చిపోయింది. ఆటో డ్రైవర్ను బండ బూతులు తిడుతూ చెలరేగిపోయింది. అంతటితో ఆగకుండా అతడిపై చెప్పుతో దాడి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకు తగిన బుద్ది చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్లో అధికారం మాదే: అమిత్ షా
చెప్పుతో కొట్టి కాళ్లు పట్టుకున్న మహిళ
పంఖూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో కలిసి స్కూటీపై ప్రయాణిస్తుంది. అదే సమయంలో ఆటో డ్రైవర్ లోకేష్ వారికి డాష్ ఇచ్చాడు. అక్కడే ఇరువురికి మధ్య గొడవ మొదలైంది. ఆటో చక్రం తన పాదంపై నుంచి వెళ్లిందని ఆరోపిస్తూ ఆ మహిళ ఆటో డ్రైవర్తో గొడవకు దిగింది. అక్కడితో ఆగకుండా బండ బూతులు తిట్టింది.
Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే ఆమె హిందీలో మాట్లాడుతుండటంతో ఆటో డ్రైవర్ లోకేష్ వీడియో తీశాడు. దీంతో మరింత చిర్రెత్తిపోయిన ఆ మహిళ తన కాలుకున్న చెప్పుతీసి లోకేష్పై దాడి చేసింది. ‘‘వీడియో తీస్తావా? తీసుకో’’ అంటూ అతడిని పలుమార్లు కొట్టింది. కానీ డ్రైవర్ లోకేష్ మాత్రం ఆమెను ఏం అనలేదు. అనంతరం ఆ మహిళ ఫోన్లో మాట్లాడింది. తనతో ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది.
Also Read: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు
అయితే అదే సమయంలో ఆమె భర్త కూడా అక్కడే ఉన్నాడు. ఆటో పక్కన స్కూటీపై కూర్చుని వీడియో రికార్డు చేశాడు. ఈ గొడవ అనంతరం లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తప్పేమి లేదని.. కావాలంటే సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే తప్పు ఎవరిదో అర్థం అవుతుందని తెలిపాడు. ఆమె భాష అర్థం కాక వీడియో తీశానని తెలిపాడు.
Also Read : దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిలను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన ఆ మహిళ తన భర్తతో కలిసి ఆటో డ్రైవర్ ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పింది. భర్తతో కలిసి ఆటో డ్రైవర్ కాళ్లు మొక్కుతూ క్షమించమని వేడుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
bangalore | crime | bangalore-police | Latest crime news