/rtv/media/media_files/2025/04/21/Ec5hsujdFfNVdVw4KVNd.jpg)
KUKATPALLY MURDER
KUKATPALLY MURDER : క్షణికావేశం, అక్రమ సంబంధాలనేపథ్యంలో భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కవిత అనే మహిళ తన భర్త సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపి పూడ్చిపెట్టింది.
ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్క్లూసివ్ వీడియో
ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
కేపీహెచ్బీ మిత్రహిల్స్లో వాచ్మెన్గా పనిచేస్తున్న సాయిలుకు హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయిలు అనారోగ్యం కారణంగా గడచిన 15 సంవత్సరాలుగా కవిత, సాయిలు వేర్వేరుగా ఉంటున్నారు. ఎలాగైనా సాయిలును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న భార్య కవిత తన చెల్లెలు, చెల్లెలు భర్తను సాయం కోరింది. వారిద్దరు కూడా సహకరించేందుకు ముందుకు వచ్చారు.
ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు!
ఇటీవలె పాతలింగయ్యపల్లి నుంచి వచ్చిన కవిత, సాయిలు కూకట్పల్లిలో అద్దెకు ఉంటున్నారు. అయితే భర్త అనారోగ్యంతో కవిత మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో చెల్లెలు, చెల్లెలు భర్తతో కలిసి సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. అనంతరం భర్త శవాన్ని పూడ్చి పెట్టింది. ఆ తర్వాత సాయిలు కనిపించడం లేదంటూ పాతలింగయ్యపల్లి సర్పంచ్కు కవిత ఫోన్ చేసి చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన సర్పంచ్ నిలదీయండతో హత్య చేసినట్లు కవిత ఒప్పుకుంది. దీంతో సర్పంచ్ కూకట్పల్లి పోలీసులకు సమాచారమిచ్చాడు. కాగా పూడ్చిన శవాన్ని తవ్వితీసిన పోలీసులు శవాన్ని ఆసుపత్రికి తరలించారు. కవితతో పాటు కవిత చెల్లెలు, చెల్లెలు భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తు్న్నారు.