Crime News : ఓరి రాక్షసుడా..ఎంతపనిచేశావురా..హైదరాబాద్‌లో దారుణం.. చిన్నారిపై అమానుషం

కామంతో కళ్లు మూసుకుపోయిన మగ రాక్షసులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియకుండానే తెగిస్తున్నారు.

New Update
rape

Rape of a child

Crime News :  కామంతో కళ్లు మూసుకుపోయిన మగ రాక్షసులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియకుండానే తెగిస్తున్నారు. హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ రాక్షసుడు ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిజానికి ఈ ఘటన జరిగి 15 రోజులు అవుతుండగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చూడండి: Illinois: నేషనల్ గార్డ్స్ రావడానికి వీల్లేదు..అడ్డుకున్న ఇల్లినాయిస్ కోర్టు

 పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... నగరంలోని సైదాబాద్ ఓ కుటుంబం నివసిస్తోంది. వారికి కూతురు(8), కుమారుడు(7) ఉన్నారు. రోజువారి కూలీపనులు చేసుకుంటూ ఆ కుటుంబం పొట్ట గడపుకుటుంది.కూలీ పనులతోనే కుటుంబాన్ని దంపతులు పోషించుకుంటున్నారు. అయితే ఆ దంపతులిద్దరూ కూలీ పనులకు వెళ్లిన సమయంలో,వారి యువకుడు ఆ ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు. అసలేం జరుగుతుందో తెలియని ఏడేళ్ల సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు నిందితుడు.

ఇది కూడా చూడండి: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం

అయితే రోజు చలాకీగా ఉండే అమ్మాయి నీరసంగా ఉండటంతో పాటు  అనారోగ్యానికి గురవ్వడంతో  తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ విషయం బయట పడింది. ఈ విషయం గురించి  తల్లిదండ్రులు పిల్లలను ఆరా తీయగా తల్లిదండ్రులకు జరిగిన వాస్తవాన్ని చెప్పాడు చిన్నారి తమ్ముడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన సదరు నిందితుడు అక్కడి నుంచి పారి పోయాడు. కాగా నిందితుడి కోసం సైదాబాద్ పోలీసులు గాలిస్తున్నారు.  

Also Read: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

Advertisment
తాజా కథనాలు