Sarpanch: సర్పంచ్ గా పోటీ చేస్తున్నారా? ఈ గుడ్ న్యూస్ మీ కోసమే.. ఆ నిబంధనకు గుడ్ బై

ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

New Update
Telangana Cabinet postponed to July 28

Telangana Cabinet postponed to July 28

ఈ రోజు  తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)  అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం(cabinet-meeting)లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Election 2025) విషయంలో ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Also Read :  వారు కోరుకుంటే పార్టీ పెడుతా...పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు

Are You Contesting As Sarpanch?

ఈ అంశంపై గతంలోనే చర్చ జరగగా తాజా సమావేశంలో చట్టాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 21(3)ని సవరించే దస్త్రంపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. కాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో జరిపిన చట్ట సవరణను తెలంగాణ పంచాయతీరాజ్‌ అధికారులు అధ్యయనం చేశారు. దాన్ని అనుసరించి రాష్ట్రంలోనూ చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసి సమర్పించగా మంత్రి ఆమోదించారు. ఈ సవరణను ఇవాళ మంత్రివర్గ సమావేశంలో సమర్పించడంతో చట్ట సవరణకు ఆర్డినెన్స్‌ జారీపై మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అనంతరం గవర్నర్‌ ఆమోదానికి పంపనున్నారు. గవర్నర్‌ ఆమోదం లభించిన వెంటనే ఆర్డినెన్స్‌ జారీ అయ్యే అవకాశం ఉంది.

Also Read :  పోలీసులు హై అలర్ట్‌... అక్కడ వందమంది రౌడీ షీటర్లు

Advertisment
తాజా కథనాలు