Smita Sabharwal : రూల్స్ మర్చిపోయారా ఐఏఎస్ గారు...అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర వీడియో వైరల్‌

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పక్కనే ఉన్న అడవిని కొట్టివేయడం సంచలనంగా మారింది. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మార్చి 31న ఎక్స్ లో ఒక ఏఐ ఫొటోను రీపోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వివాదస్పదమైంది.

New Update
Dileep Sunkara Video About Smita Sabharwal Issue

Dileep Sunkara Video About Smita Sabharwal Issue

Smita Sabharwal : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పక్కనే ఉన్న అడవిని కొట్టివేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వ భూమిలో ఐటీ హబ్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో చెట్లను నరకడం వివాదమైంది.ఈ భూముల్లోని చెట్ల నరికివేత, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తటంతో హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలతో పాటు విపక్ష నేతలు ఆందోళనలు చేపట్టారు. పలువురు సోషల్ మీడియాలో పోస్టుల పెడుతూ వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మార్చి 31న ఎక్స్ (ట్విట్టర్) లో ఒక ఏఐ ఫొటోను రీపోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వివాదస్పదమైంది.

Also read: Husband: భార్య బ్యూటీపార్లర్‌కు వెళ్తే షాక్ ఇచ్చిన పాపిష్టి మొగుడు.. పాపం బోడిగుండు భార్య

ఫేక్ ఫోటోను పోస్ట్ చేశారని, వివరణ కోరుతూ స్మితా సబర్వాల్‌కు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించగా.. స్మితా సబర్వాల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు పెట్టారు. పోలీసుల నోటీసులపై స్పందించిన స్మితా సబర్వాల్.. తాను కేవలం ఒక ఏఐ ఫొటోను రీపోస్ట్ చేశానని.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయలేదని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. వాటికి తోడు.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తెలిపే పోస్టును కూడా రీపోస్ట్ చేయటం అగ్గికి ఆజ్యం పోసినట్టయింది.ఓవైపు.. పోలీసులకు సహకరిస్తానని చెబుతూనే.. తాను రీపోస్ట్ చేసిన ఏఐ ఫొటోతో ఉన్న పోస్ట్‌ను 2000 మంది పైగా షేర్ చేశారని.. మరి వారందరికి కూడా నోటీసులు జారీ చేస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించారు స్మితా సబర్వాల్. ఒకవేళ అలా చేయకపోతే.. ఇది సెలెక్టివ్ టార్గెటింగ్ అవుతుందని, చట్టం ముందు అందరూ సమానమనే అంటూ మరో సంచలన ట్వీట్ చేయటంతో మరింత వివాదాస్పదమైంది.

Also Read: ట్రంప్‌ను తిడుతూ.. వలసదారులకు స్వాగతం అంటున్న అమెరికన్ పౌరులు

అయితే.. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్మితా సబర్వాల్‌కు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. స్మితా సబర్వాల్ పోస్టులకు కౌంటర్‌గా.. కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. బ్యూరోక్రాట్‌గా ఉన్న స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చా.. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించొచ్చా.. అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకరకు సంబంధించిన ఒక వీడియోను ఈ సందర్భంగా వైరల్ చేస్తున్నారు.   

Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!

"ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కానీ.. అది గ్రేడ్-4, గ్రేడ్-3 అధికారా లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్ కేటగిరీలో ఉన్నారా.. బ్యూరోక్రాట్ కింద సివిల్ సర్వెంట్స్ కేటగిరీలో ఉంటారా..? ఇలా ఏ స్థాయిలో ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటి వ్యక్తి.. ప్రధానంగా రెండు రూల్స్‌కి లోబడి పని చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కాండాక్ట్ రూల్స్ 1964, ఆల్ ఇండియా సర్వీసెస్ కాండాక్ట్ రూల్స్ 1968లో.. స్పష్టమైన మార్గనిర్దేశకాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రమాణస్వీకారం చేసి.. సర్వీస్ రిజిస్టార్లో సంతకం పెట్టడానికి ముందే.. స్పష్టంగా చెప్తాయి.

Also Read: తెలంగాణ రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ పంపిణీ? ఉడికించి వీడియో పోస్ట్ చేసిన లబ్దిదారుడు!

ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వ్యక్తులు చేసుటువంటి వ్యాఖ్యలు.. పూర్వం ఉన్న ప్రభుత్వంపై కానీ.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై కానీ.. కేంద్ర ప్రభుత్వంపై గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ.. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి గానీ.. మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని మీరు అందులో మిళితం చేస్తూ గానీ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి మీకు అవకాశం లేదు. అది చట్టరీత్యా నేరం. అలా చేస్తే వారి సర్వీస్ కాండాక్ట్ రూల్స్ ప్రకారం ఉన్నత అధికారులు వారి మీద చర్యలు (డిసిప్లినరీ యాక్షన్) తీసుకోవడానికి అవకాశం ఉంటుంది." అని వీడియోలో లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర వివరించారు. 

Also Read: ‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!

అయితే.. దిలీప్ సుంకర ఈ వీడియోను వేరే ఏదో సందర్భంలో వివరించగా.. ప్రస్తుత సందర్భానికి అనుకూలంగా ఆ వీడియోను కట్ చేసి కాంగ్రెస్ నేతలు షేర్ చేస్తున్నారు. "నాలాగే 2000 మంది ఆ పోస్టును రీషేర్ చేశారు.. వాళ్లందరిపై చర్యలు ఉంటాయా..? అని అమాయకంగా అడుగుతున్న ఐఏఎస్ గారూ.. సాధారణ వ్యక్తులకు, ఐఏఎస్ అధికారులకు తేడా లేదంటారా..? ఐఏఎస్ అధికారులకు సర్వీస్ రూల్స్ ఉంటాయి కదా.. వాటిని పాటించనక్కర్లేదంటారా...?" అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం స్మీతాపై చర్యలు తీసుకుంటుందా? లేక మందలించి వదిలేస్తుందా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

Also Read: AP Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు