Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలే...వర్షాలు!
తెలంగాణలో రాగల ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.
తెలంగాణలో రాగల ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.
తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.దాంతో గురువారం మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 27 వరకు ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి,నిర్మల్ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
ఈ దసరాను విసూత్నంగా జరుపుకునేందుకు మంచిర్యాల జిల్లా బోయపల్లి గ్రామస్థులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ.100కు కూపన్ కొని లక్కీడ్రాలో గొర్రె పొట్టేలు, మేకపోతు, నాటుకోడి, ఫుల్ బాటిల్ గెలుచుకోవాలంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 10న డ్రా తీయనున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న జితేందర్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనికి మద్యం తాగించి.. దాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మంచిర్యాలలోని పద్మావతి కాలనీలో మహ్మద్ మొయిన్-అవంతి అనే దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర 5 మొబైల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్ బాక్స్లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత మహిళను సఖీ సెంటర్కు తరలించారు.
సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. శాశ్వత ఉద్యోగుల్లో ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్ ఇస్తున్నట్లు ప్రకటిస్తుంది. మరోవైపు కాంట్రక్టు కార్మికులకు కూడా రూ.5 వేల బోనస్ ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులకు విద్యా, సాంకేతిక, ఆర్థిక, సామాజిక అవగాహన పెంపొందిచేందుకు 'బాలశక్తి' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలోని 52 విద్యాసంస్థల్లో దీనిని శుక్రవారం అధికారికంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1576 స్టాఫ్నర్సు పోస్టులు, వైద్య విధానపరిషత్ పరిధిలో 332, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్ విభాగంలో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్నర్సు తదితర ఖాళీలు ఉన్నాయి.