ఆదిలాబాద్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
ఆదిలాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. బస్సులోని పలువురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.