Pakistan: పాకిస్థాన్ ముర్దాబాద్.. అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు (VIDEO VIRAL)

MIM అధినేత గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్‌పై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అది ఫైయిలైన దేశమని, పాక్‌ను ఇక శిక్షించడమే మిగిలి ఉందని విమర్శలు గుప్పించారు.

New Update
Asaduddin Owaisi

ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బుధవారం పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన పాకిస్తాన్‌పై ఫైర్ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌పై స్పందిస్తూ బీహార్‌లో జరిగిన ర్యాలీలో ఒవైసీ పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ సిగ్గులేని, ఫైయిలైయిన దేశమని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఆ దేశానికి మాటలతో చెప్పే సమయం లేదని, శిక్షించే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం ఇప్పుడు పాకిస్తాన్‌కు గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడి నుండి వస్తున్న ఉగ్రవాదులు అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొంటున్నారని ఒవైసీ అన్నారు. ఉగ్రవాదాన్ని తొక్కాల్సిన టైం వచ్చిందని అసదుద్దీన్ అన్నారు. 

ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులపైనే దాడులు చేస్తే ఆధారాలు చూపించాలని పాకిస్తాన్ అడగటాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. పఠాన్‌కోట్, ముంబై దాడులకు సంబంధించి బలమైన ఆధారాలు ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ ప్రజలు ఇంకా ఆధారాలు అడుగుతున్నారు. పాక్ నుంచి వచ్చి టెర్రరిస్టులు ఇండియాపై దాడులు చేస్తుంటే.. ఆ విషయాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ అంగీకరించదని ఒవైసీ అన్నారు.

(pakistan | operation sindoor latest | Operation Sindoor Attack | operation Sindoor | asaduddin-owaisi | bihar | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు