/rtv/media/media_files/2025/05/07/MHgny12r2L6VypVhiAEJ.jpg)
ఇండో, పాకిస్తాన్ హై టెన్షన్ పరిస్థితి కారణంగా ఇండియన్ సెక్యురీటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమయ్యారు. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇంకా రెచ్చగొట్టే ఉద్దేశం భారత్కు లేదని ఆయన తెలిపారు. పాకిస్థాన్ కవ్విస్తే మాత్రం దానికి తగ్గట్టు కౌంటర్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
After Operation Sindoor, NSA Ajit Doval has held urgent talks with security chiefs from the US, UK, Russia, China, France, Saudi Arabia, UAE & Japan.
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 7, 2025
India has made it clear—No interest in escalation, but fully prepared to respond if provoked pic.twitter.com/yOGoWPnPBU
అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా, జపాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం అజిత్ దోవల్ సమావేశమయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ గురించి వారికి వివరించారు. అదేవిధంగా రష్యా, ఫ్రాన్స్ జాతీయ భద్రతా సలహాదారులతో కూడా దోవల్ సమావేశమయ్యారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మాక్రో రూబియో, యూకే జాతీయ భద్రతా సలహాదారు జొనాథన్ పొవెల్, సౌదీ అరేబియా జాతీయ భద్రతా సలహాదారు ముసైద్ అల్ ఐబన్, సౌదీ అరేబియా జాతీయ భద్రతా సలహాదారు హెచ్హెచ్ షేక్ తహనూన్, జపాన్ జాతీయ భద్రతా సలహాదారు మసటక ఒకానోతో దోవల్ భేటీ అయ్యారు. రష్యా జాతీయ భద్రతా సలహాదారు సెర్గీ షోల్గు, ఫ్రాన్స్ ప్రతినిధి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు.
ajit-doval | Indian James Bond | foreign security advisors | operation Sindoor | operation sindoor air strike | latest-telugu-news | india pak war | Indian Army