విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్ కీలక సమావేశం

ఆపరేషన్ సిందూర్‌ గురించి విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సమావేశామైయ్యారు. ఎయిర్ స్ట్రైక్‌కు గురించి వారికి వివరించారు. అమెరికా, UK, సౌదీ అరేబియా, జపాన్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం అజిత్‌ దోవల్‌ సమావేశమయ్యారు.

New Update
Ajit Doval

ఇండో, పాకిస్తాన్ హై టెన్షన్ పరిస్థితి కారణంగా ఇండియన్ సెక్యురీటీ అడ్వైజర్ అజిత్‌ దోవల్‌ వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమయ్యారు. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇంకా రెచ్చగొట్టే ఉద్దేశం భారత్‌కు లేదని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌ కవ్విస్తే మాత్రం దానికి తగ్గట్టు కౌంటర్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, సౌదీ అరేబియా, జపాన్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం అజిత్‌ దోవల్‌ సమావేశమయ్యారు. పాకిస్థాన్‌ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ గురించి వారికి వివరించారు. అదేవిధంగా రష్యా, ఫ్రాన్స్‌ జాతీయ భద్రతా సలహాదారులతో కూడా దోవల్ సమావేశమయ్యారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మాక్రో రూబియో, యూకే జాతీయ భద్రతా సలహాదారు జొనాథన్‌ పొవెల్‌, సౌదీ అరేబియా జాతీయ భద్రతా సలహాదారు ముసైద్‌ అల్‌ ఐబన్‌, సౌదీ అరేబియా జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌హెచ్‌ షేక్‌ తహనూన్‌, జపాన్‌ జాతీయ భద్రతా సలహాదారు మసటక ఒకానోతో దోవల్‌ భేటీ అయ్యారు. రష్యా జాతీయ భద్రతా సలహాదారు సెర్గీ షోల్గు, ఫ్రాన్స్‌ ప్రతినిధి వాంగ్‌ యీతో ఫోన్‌లో మాట్లాడారు.

ajit-doval | Indian James Bond | foreign security advisors | operation Sindoor | operation sindoor air strike | latest-telugu-news | india pak war | Indian Army

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

corona cases in india: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే?

భారతదేశంలో కరోనావైరస్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,000 కేసులు పెరిగాయి. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా 2,710కి చేరింది. కేరళలో 1,147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. 

New Update
corona virus cases india cross 2700 and 7 death toll state wise infections

corona virus cases india cross 2700

దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి మళ్ళీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. దేశంలో గడిచిన 24 గంటల్లో సుమారు 1000 కరోనా కేసులు పెరిగాయి. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా.. తాజాగా 2,710కి చేరింది. 

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

corona virus cases india

ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్కరోజులోనే సుమారు 1000 కరోనా కేసులు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. మే 30వ తేదీన 1,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే తాజాగా ఆ కేసుల సంఖ్య 2,710కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,147 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 424 కేసులు, ఢిల్లీలో 494 కేసులు, గుజరాత్లో 223 కేసులు, కర్ణాటక - తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 116 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ బారిన పడి దాదాపు ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. అయితే వీటిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

Advertisment
Advertisment