Moscow Attack: రష్యాలో ఉగ్రదాడి ఘటన.. స్పందించిన పుతిన్
రష్యా జరిగిన భీకర ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పందించారు. ఘటనను అనాగరికి ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే ఈ మరణకాండకి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
రష్యా జరిగిన భీకర ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పందించారు. ఘటనను అనాగరికి ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే ఈ మరణకాండకి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
నావల్నీ మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన మృతదేహాన్ని కావాలనే దాస్తున్నారని.. మరణానికి దారితీసిన ఆధారాలను శరీరంలో నుంచి బయటపడకుండా జాగ్రత్తపడేందుకు అలా చేస్తున్నట్లు నావల్ని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
క్యాన్సర్కు రష్యా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను తయారుచేస్తున్నారని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తయారీ.. కీలక దశలో ఉందని.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
ఇటీవల ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక రవాణా విమానం కూలడంతో ఉక్రెయిన్ బలగాలే ఆ విమానాన్ని కూల్చేశాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. వాళ్లు పొరపాటున చేశారా లేదా ఉద్దేశపూర్వకంగా చేశారా నాకు తెలియదు.. కానీ ఇది నేరం అంటూ ఓ టీవీ ప్రసంగంలో చెప్పారు.
ఉక్రెయిన్పై తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదని.. తమ లక్ష్యాలు నెరవేరేవరకు శాంతి నెలకొల్పడం వీలు కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్కు నాజీల నుంచి విముక్తి కల్పించి.. నిస్సైనికీకరణ జరిగేలా, నాటోలో చేరకుండా తటస్థంగా ఉండేలా చేయడమే తమ లక్ష్యాలని తెలిపారు.
రష్యా ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్ట సభ్యులు నిర్ణయించారు. అయితే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (71) తెలిపారు. పుతిన్ రాబోయే ఎన్నికల్లో కూడా గెలవడం కాయమని అక్కడివారు భావిస్తున్నారు.
రష్యాలో తన మజీ ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ఆమెను అత్యాచారం చేసి 111 సార్లు కత్తితో పొడిచిన హంతకుడికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు. అలాగే అతడ్ని సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు పంపించారు. బాధితురాలు తల్లి హంతకుడ్ని అలా వదిలేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ గుండె పోటుకు గురయ్యారంటూ వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే.. ఆ దేశ అధికార వర్గాలు మాత్రం ఇంత వరకు ఈ విషయంపై స్పందించలేదు.
చైనాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్కు చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ప్రారంభించగానే.. ఐరోపాకు చెందిన నేతలు, ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పుతిన్తో పాటు వివిధ దేశాల నేతలు, అలాగే 1000 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పుతిన్ మాట్లాడుతుండగా.. ఇలా ఐరోపా నేతలు మధ్యలోనే వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.