Tripura : వర్ష బీభత్సం.. 22 మంది మృతి!
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల త్రిపురలో సుమారు 22 మంది మృతి చెందారు. మరో 10 మంది ఆచూకీ లేకుండా పోయారు. రాష్ట్రంలోని 450 సహాయ శిబిరాల్లో 65,400 మంది ఆశ్రయం పొందుతున్నారని అధికారి ఒకరు తెలిపారు.