నాకు మంత్రి పదవి.. అద్దంకి సంచలన ఇంటర్వ్యూ!
కేసీఆర్ బహిరంగ సభలకే వస్తాడని.. బయటకు రాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంత్రి పదవి విషయంలో తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అద్దంకి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
కేసీఆర్ బహిరంగ సభలకే వస్తాడని.. బయటకు రాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంత్రి పదవి విషయంలో తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అద్దంకి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఫైర్ అయ్యారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి వేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ దారుణాన్ని భారతదేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి మధుసూదన రావు సోమిశెట్టి భౌతిక కాయానికి పవన్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ8గా ఉన్న చాణక్యను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. దీంతో నెక్ట్స్ అరెస్ట్ ఎవరిది ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు.. అంటూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. HCU భూముల విషయంలో రేవంత్ టార్గెట్ గా ఆమె ఈ పోస్ట్ చేశారన్న చర్చ సాగుతోంది.
హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయానికి అమ్మనబ్రోలు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగిసింది. రేపు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు తిరిగి రానుంది. ఈ పర్యటనలో దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
ఏపీలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగనుంది. ఈ రోజు అమిత్ షాతో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ మీజీ చీఫ్ అన్నామలై, స్మృతీ ఇరానీలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
హైడ్రా పనితీరు బాగుందని కుకట్ పల్లి BRS ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కితాబిచ్చారు. నగరంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా చేస్తున్న కృషిని అభినందించారు. ఈ రోజు హైడ్రా చీఫ్ రంగనాథ్ ను కలిసిన కృష్ణారావు కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.