తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక.. నేటి నుంచే సన్న బియ్యం పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఉగాది కానుకగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు.