/rtv/media/media_files/2024/12/10/dpApuSMa6FjFDMLFWScG.jpg)
Current shock
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని ఎన్.అన్నారంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి రైతు దొంతగాని నాగయ్య(45) మృతి చెందారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ఇంతలోనే చనిపోయారు. నాగయ్య చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
ఇదిలా ఉండగా ఇటీవల ఆన్లైన్ లైవ్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. 36 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల్లో ఉన్న ఓ వ్యాపారి.. ఎవరైనా ముందుకు వచ్చి తనని ఆదుకోవాలని వేడుకున్నాడు. ఎవరూ స్పందించకపోవడంతో గన్తో పాయింట్ బ్లాక్లో షూట్ చేసుకొని చనిపోయాడు. యూపీ లక్నోలో ఈ విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. తన నిస్సహాయ స్థితిని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇది కూడా చూడండి: Blood Pressure: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!
డయాబెటిక్తో బాధపడుతున్న కూతురికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు కొనే సామర్థ్యం కూడా లేదని ఆవేదన పడ్డాడు. ఫేస్బుక్ లైవ్ వీడియో చూసి ఫ్యామిలీ సభ్యులు పోలీసులకు చెప్పారు. అయితే స్పాట్కు వెళ్లే సరికి అతను షూట్ చేసుకుని చనిపోయాడు.సెక్యూర్టీ లైసెన్స్ ఉన్న 12 బోర్ గన్తో అతను కాల్చుకున్నాడు. బలవన్మరణానికి ముందు అతను తన ఫేస్బుక్ వీడియోలో అందర్నీ వేడుకున్నాడు.
ఇది కూడా చూడండి:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు.. తన కుటుంబాన్ని ఆదుకోవాలన్నాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇలా చేస్తున్నానని చెప్పాడు. తనకు 15 కోట్ల అప్పు ఉందని, అతని బిజినెస్ పాట్నర్ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపించాడు. డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్న తన కూతుర్ని ఇన్సులిన్ ఇవ్వలేకపోతున్నట్లు అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్