విద్యార్థులకు పండగే.. వరుసగా మూడు రోజులు హాలిడేస్
ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కార్పొరేట్ కంపెనీలకు శని, ఆదివారం సెలవు కావడంతో వరుసగా మూడు రోజులు వచ్చాయి.
ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కార్పొరేట్ కంపెనీలకు శని, ఆదివారం సెలవు కావడంతో వరుసగా మూడు రోజులు వచ్చాయి.
విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి.
హిమాచల్ప్రదేశ్లో వాతావరణ మార్పుల కారణంగా భారీగా మంచు, వర్షం కురుస్తోంది. ఈ తరుణంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంబా, కులు, మనాలిలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. CBSE బోర్డు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని తెలిపింది.
ఏపీ, తెలంగాణలో ఆదివారాలు కాకుండా వరుసగా మరోరెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒక సెలవు రానుంది. అలాగే టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది. ఆ రోజు సెలవు వచ్చే ఛాన్స్ ఉంది.
ఉత్తరప్రదేశ్ మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు భక్తులు వారణాసి కూడా వెళ్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీంతో వారణాసి మేజిస్ట్రేట్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు సెలవులు ప్రకటించింది.
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలి తీవ్రత పెరగడంతో అన్ని పభుత్వ, ప్రైవేట్, అంగన్వాడీ స్కూళ్లకు సెలవు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి 15 వరకు ఈ సెలవులు ఉంటాయని తెలిపింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.
కాలుష్యం కారణంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇచ్చింది. ఉత్తర భారత రాష్ట్రాలను ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యం సమస్య వేధిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. హైదరాబాద్లోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.