/rtv/media/media_files/2025/02/06/7rgCBCvhJkJDU09ukPJo.jpg)
schools closed in jharkhand after heavy rainfall
దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాలు అధిక వర్షాలు, వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షాలుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ పరిస్థితి మరింత దారుణంగా దిగజారిపోతుంది. అనేక రాష్ట్రాల్లోని జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ప్రజల ఇళ్ళు నీట మునిగిపోయాయి. వీధులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ సముద్రాన్ని తలపించాయి. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాలు వరదల్లో చిక్కుకున్నాయి.
5 జిల్లాల్లో పాఠశాలలు బంద్
జంషెడ్పూర్లోని ఆదర్శ్ నగర్లో మూడు రోజులుగా నిరంతరం వర్షం కురిసింది. దీంతో కాలనీలోని మొదటి అంతస్తు వరకు నీరు వచ్చింది. వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వాహనాలు నడిచే రోడ్లలో పడవలను ఉపయోగించి చాలా మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. దీని కారణంగా రాంచీతో సహా జార్ఖండ్లోని ఐదు జిల్లాల్లో ఇవాళ(శుక్రవారం) పాఠశాలలు మూసివేశారు. రాంచీ, ఖుంటి, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు ఈరోజు మూసివేశారు. తూర్పు సింగ్భూమ్, సరైకేలా-ఖర్సవాన్ జిల్లాల్లో 8వ తరగతి వరకు సెలవు ప్రకటించారు.
Also Read: Iran-Israel War: 8వ రోజుకు చేరుకున్న యుద్ధం..క్లస్టర్ బాంబ్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్
మహారాష్ట్రలో మరింత దారుణం
భారీ వర్షాల తర్వాత మహారాష్ట్రలోని అనేక నగరాల్లో పరిస్థితి మరింత దిగజారింది. నాసిక్-పుణే పరిస్థితి సైతం దారుణంగా ఉంది. ముంబైలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు గుజరాత్లోని అనేక నగరాలు పొంగిపొర్లుతున్నాయి. అహ్మదాబాద్, గాంధీనగర్, నవ్సరి, అమ్రేలి, ధాంగ్లలో వరద పోటెత్తుతుంది.
ఈ ప్రాంతాల్లో మరికొన్ని రోజులు
ఈ ప్రాంతాల్లో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్లలో ఇవాళ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనితో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు మెరుపులు, తుఫానులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.