TS News: పెళ్లి వేడుకలో పెను విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడడంతో..!
సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మరణించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది పెళ్లి కూతురును తీసుకువచ్చేందుకు ఆందోల్ గ్రామానికి వెళ్తుండగా..ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది.