సంగారెడ్డిలో దారుణం.. ఆస్తి కోసం తల్లిని 20 సార్లు పొడిచి.. ఆ కసాయి కొడుకు ఏం చేశాడంటే?

ఆస్తి కోసం కన్న తల్లిని కిరాతంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మద్యానికి బానిసై రోజూ ఇంట్లో గొడవలు పడేవాడు. ఈ క్రమంలో తల్లిని 20 చోట్ల కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లగ చికిత్స తీసుకుంటూనే మృతి చెందింది.

New Update
Crime news balnagar

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో దారుణం ఘటన జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లినే కొడుకు హత్య చేశాడు. నవమాసాలు మోసి చిన్నప్పటి  అల్లారు ముద్దుగా పెంచిన తల్లినే దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. మద్యానికి బానిసై ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ఆస్తిని తనకి రాసి ఇచ్చేమని మద్యం మత్తులో కన్న తల్లిని కత్తితో పొడిచాడు.

ఇది కూడా చూడండి: ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !

20 చోట్ల కత్తితో పొడిచి..

ఒక దగ్గర కాదు.. ఏకంగా 20 చోట్ల కత్తితో పొడిచి తల్లిని చంపాడు. స్థానికులు వెంటనే గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స తీసుకుంటూనే ఆ తల్లి మృతి చెందింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి.. ఆ కొడుకును అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కన్న తల్లినే పొట్టన పెట్టుకున్నాడు. 

ఇది కూడా చూడండి: Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి

ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్రలో ఓ దారుణం జరిగింది. ఈర్ష్యతో 13 ఏళ్ల బాలుడు ఓ చిన్నారిని హతమార్చిన దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాల్‌ఘర్‌ జిల్లాలో ఓ ఆరేళ్ల బాలికను కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ముద్దు చేస్తుండేవారు. ఇది చూడలేని బాలుడు ఈర్ష్యతో ఆ బాలికను చంపాలని ప్లాన్ చేశాడు.

ఇది కూడా చూడండి: Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!

ఈ క్రమంలో రామన్‌ రాఘవ్‌ అనే సినిమా చూసి మరి ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేశాడు. సమీపంలో ఉన్న గుట్ట దగ్గరకు తీసుకుని వెళ్లి ఆమె ముఖంపై పెద్ద బండరాయి వేశాడు. దీంతో ఆ బాలిక అక్కడిక్కడే మరణించింది. బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు