Mumbai: మేఘా అవినీతిపై ముంబై హైకోర్టులో విచారణ!
మహారాష్ట్రలోని ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా సంస్థ మోసానికి పాల్పడిందంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఇది పెద్ద కుంభకోణమని.. విస్తృతమైన దర్యాప్తు చేయాలని పిటిషనర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.