PM Modi: వీరులారా వందనం.. ప్రధాని మోదీ ఎమోషనల్ స్పీచ్
పంజాబ్లోని ఆదంపుర్ ఎయిర్బేస్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు.
పంజాబ్లోని ఆదంపుర్ ఎయిర్బేస్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు.
ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్లోని ఆదంపుర్ ఎయిర్బేస్ను సందర్శించారు. ఆయన దిగిన ఫొటో వెనుక " శత్రు పైలట్లు ఎందుకు ప్రశాంతంగా నిద్రపోరు'' అని రాసి ఉంది. దీన్నిబట్టి ఆయన శత్రు దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న ఎయిర్ఫోర్స్తో ప్రధాని భేటీ అయ్యారు. పంజాబ్లో అధంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. పాక్కు చుక్కలు చూపించి.. ఎయిర్ ఫోర్స్ సత్తా చాటారని మోదీ ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్లో వైమానిక దళం ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ ఉగ్రరూపం దాల్చారు. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని అంతం చేశాకే పాకిస్తాన్తో చర్చలకు సిద్ధమని మోదీ అన్నారు. ఇదివరకెన్నడూలేని విధంగా పాక్పై కోపంతో ప్రధాని మీడియా ముందుకు వచ్చారు.
అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాకిస్తాన్ బెదిరిస్తే ఇండియా సహించదని ప్రధాని మోదీ హెచ్చరించారు. బ్లాక్మెయిల్ చేస్తే వారినే టార్గెట్ చేసి అటాక్ చేస్తామని మోదీ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ పోరు ఆపదని ప్రధాని తేల్చి చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోకజాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు.