IND-PAK WAR: భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రికులను పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటిలిజన్స్రిపోర్టుతో చార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దుల్లో పాక్, భారత్ ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ సమయంలో చార్ధామ్ యాత్రను నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో చార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ చార్ ధామ్ యాత్రను నిలిపేయాలని కేంద్రం నిర్ణయించింది. కాగా ఇటీవలే ఉత్తరాఖండ్ లోని దేవాలయాల తలుపులు తెరుచుకున్నాయి.
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
యుద్ధం నేపథ్యంలో గంగోత్రి.. యుమునోత్రి.. బదరీనాథ్.. కేధార్ నాథ్ లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ దేవాలయాలు టార్గెట్ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో చార్ ధామ్ యాత్ర కు లక్షలాదిగా భక్తులు భారీగా తరలివస్తుంటారు . కానీ, పాకిస్తాన్ హిందూ దేవాలయలే టార్గెట్ గా డ్రోన్లతో దాడుల చేస్తుంది.ఈ నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను కొంతకాలం నిలిపివేయాలని మోడీ సర్కార్ నిర్ణయించింది.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్లో ప్రజల తిరుగుబాటు
ప్రస్తుతం బద్రినాత్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే భక్తులు తమ ప్రయాణాలను ప్రస్తుతం వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చార్ ధామ్ యాత్ర కొనసాగించవద్దని చూచించింది. అలాగే, అక్కడ హెలికాప్టర్ సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధం కారణంగా ఈ యాత్ర సాగుతుందా లేదా అనే సందిగ్ధం సర్వత్రా నెలకొంది.
Also Read: పాక్కు దెబ్బ మీద దెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన!