పార్టీ నుంచి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చం*పినా తండ్రి | Father ki*lled son | Nalgonda | RTV
పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం సాధించడమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయన విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెంలో ప్రారంభించారు.
సూర్యాపేట పరువు హత్య పై ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసులో A1గా అమ్మాయి అన్నయ్యను, A4గా నాయనమ్మను చేర్చినట్లు తెలిపారు. నిందితులు ఎలాంటి ఆయుధం వాడకుండా కృష్ణను చేతులతనే చంపినట్లు తెలిపారు.
సూర్యాపేట పరువు హత్య కేసులో కృష్ణ భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. అన్నయ్యను రెచ్చగొట్టి తన నానమ్మే కృష్ణను హత్య చేయించినట్లు తెలిపింది. అంతేకాదు హత్య తర్వాత తనభర్త ప్రైవేట్ పార్ట్స్ను నాన్నమ్మ కసితీరా తొక్కినట్లు వాపోయింది
సూర్యాపేట జిల్లా పరువు హత్య ఘటనలో కృష్ణ భార్య భార్గవి సంచలన విషయాలు బయటపెట్టింది. కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో ఆమె కుటుంబ సభ్యులే తన భర్త హత్య చేయించినట్లు తెలిపింది.
నల్గొండలో బీఆర్ఎస్ రైతు దీక్షకు తెలంగాణ హైకోర్డు అనుమతి ఇచ్చింది. జనవరి 28న షరతులతో దీక్ష జరుపుకోవచ్చని చెప్పింది. 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ భావించిన సంగతి తెలిసిందే. దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది.
ఛత్తీస్ఘడ్ గరియాబాద్ భారీ ఎన్ కౌంటర్లో నల్గొండ జిల్లా వాసి మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంలకు చెందని పాక హన్మంతు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. 45ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లగా ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
నల్గొండలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాదర్నా అంశంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఫర్నీచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు.