/rtv/media/media_files/2025/05/27/MLh3ugTQAGGzc4Vbmn97.jpg)
గవర్నమెంట్ జాబ్.. పైగా టీచర్ జాబ్.. ఇంకేముంది హాయిగా ఎంజాయ్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సంవత్సరం పాటు పాఠశాలకు వెళ్లకుండా ఫుల్ శాలరీ తీసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొర్రతండ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థులు లేకపోవడంతో గత ఏడాది జులైలో గాగిలాపురం పాఠశాలకు డిప్యూటేషన్ పై వెళ్లింది పర్వీన్ సుల్తానా. అయితే ఆమె విధులకు హాజరు కాకపోగా అప్పుడప్పుడు దేవరకొండకు ఆమె వెళ్లినప్పుడు హాజరు పట్టికలో సంతకాలు తీసుకునేవాడు ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్.
ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఎంజాయ్
ఇలా ఏడాది కాలంగా విధులకు డుమ్మా కొడుతూ ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఎంజాయ్ చేసింది సుల్తానా. అయితే ఆమె అవినీతిలో హెడ్ మాస్టర్ వేణు మాధవ్, ఇన్ ఛార్జ్ మాజీ ఎంఈవో సామ్యా నాయక్ లు కూడా సగం పాలుపంచుకున్నారు. సుల్తానాకు వచ్చిన జీతంలో సగం జీతాన్ని వేణు మాధవ్, సామ్యా నాయక్ షేర్ చేసుకునేవారు.
అయితే ఇదే విషయంపై ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ డీఈవో భిక్షపతికి కూడా పట్టించుకోలేదు. దీంతో డీఈవో భిక్షపతి వ్యవహారంపై తాడో పేడో తేల్చుకునేందుకు డీఈవో కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ముట్టడించి నిరసన చేపట్టాయి. దీంతో మహిళా టీచర్తో పాటు హెడ్ మాస్టర్ వేణు మాధవ్, ఇన్ఛార్జ్ మాజీ ఎంఈవోగా ఉన్న సామ్యా నాయక్లను కూడా విద్యా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
telangana | nalgonda | salary | govt-teachers | telugu-news