/rtv/media/media_files/2025/06/21/affair-nalgonda-2025-06-21-12-34-53.jpg)
Nalgonda: నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళతో వివాహహేతర(Illegal Affair) సంబంధం పెట్టుకున్నాడని అతన్ని చెట్టుకు కట్టేసి మరి కొట్టి చంపేశారు. నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ జానయ్య (34) అనే వ్యక్తికి స్థానికంగా ఉండే ఓ మహిళతో అక్రమసంబంధం ఉంది. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో కొందరు అతన్ని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలైన జానయ్యను వెంటనే నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పిల్లల్ని చంపి..
మేఘాలయలో హనీమూన్ కు అని తీసుకువెళ్లి కట్టుకున్న భర్తను సోనమ్ అనే మహిళ ప్రియుడితో కలిసి చంపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే మరో దారుణమైన యూపీలోని ముజఫర్నగర్లో వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి హనీమూన్కి వెళ్లేందుకు ఓ వివాహిత తన ఇద్దరు పిల్లల్ని చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్కలి గ్రామంలో 24 ఏళ్ల ముస్కాన్ అనే మహిళ తన ప్రేమికుడితో హనీమూన్కి వెళ్లేందుకు తన ఇద్దరు పిల్లలను అడ్డంకిగా మారుతారని భావించి వారిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ముస్కాన్ ను అరెస్టు చేశామని, ఆమె ప్రేమికుడు జునైద్ పరారీలో ఉన్నాడని తెలిపారు.