నల్లగొండకే నాలుగు ఎమ్మెల్సీలు..! | MLA Quota MLC Candidates List In Nalgonda | RTV
సీఎం రేవంత్, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు సంబంధం లేకుండా హైకమాండ్ కోటాలో విజయశాంతి ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఈ అంశం కాంగ్రెస్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. హైకమాండ్ తో ఆమె టచ్ లో ఉన్నారన్న ప్రచారం మొదలైంది.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. కావలి గ్రీష్మ (SC), బీటీ నాయుడు (BC), బీద రవిచంద్ర (BC) పేర్లను ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఅర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తోంది. మొత్తం ఐదు స్థానాల్లో.. నాలుగు ఎమ్మెల్సీలను తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామన్నారు. అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో BRS చెప్పాలన్నారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా సాగింది. ఆరేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిని నెగ్గిన కాంగ్రెస్ ఇప్పుడు ఓడిపోయింది. దీనికి కారణం బీజేపీ చేసిన గ్రౌండ్ వర్కే కారణం అంటున్నారు.