Maganti Gopinath: బుల్లెట్ ర్యాలీతో మొదలై..మూడుసార్లు ఎమ్మెల్యేగా...
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసిన మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టిన తీరు ఆసక్తికరం. 1983లో తొలిసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గోపీనాథ్ తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకున్నారు. అలా టీడీపీ కార్యకర్తగా మారారు.