/rtv/media/media_files/2025/06/08/vHwJEnPNrrNaCpy7VTNF.jpg)
మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. మూడు రోజులుగా AIG హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాగంటి ఆరోగ్యం క్షీణించడానికి ఆయన అనుచరుడు మహమ్మద్ సర్ధార్ ఆత్మహత్య కారణం. వేధింపుక కారణంగా సర్థార్ ఇంటిపై నుంచి దూకి బుధవారం (జూన్ 4)న చనిపోయాడు. దీంతో మాగంటి గోపీనాథ్ మనస్థాపం చెందారు. నిద్రాహారాలు మానేసి సర్థార్ గురించే ఆలోచించడం మొదలు పెట్టారు. మాగంటి గోపీనాథ్ గురువారం మహమ్మాద్ సర్దార్ అంతిమయాత్రలో కూడా పాల్గొన్నారు. అప్పటికే ఆయనకు కిడ్రీ సమస్య ఉంది. దీంతో గురువారం మాగంటి గోపీనాథ్కి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు AIG హాస్పిటల్కు తరలించారు. అనుచరుడు మరణం ఆయన మనసును బాగా కదిలించింది. ఆయన సర్థార్ ఆత్మహత్య కుడిభుజంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్గా పని చేసే వ్యక్తి సర్థార్. బోరబండ డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ సర్థార్ (34) కర్ణాటక ఉమ్నాబాద్కు చెందిన సర్దార్ కుటుంబంతో బోరబండ ఎస్ఆర్టీనగర్లో స్థిరపడ్డారు. ఇదే ప్రాంతంలో మెడికల్ షాపును నిర్వహించుకుంటూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.
ఇది ప్రజా పాలన నా? ప్రజలు కోరుకున్న పాలన ఇదేనా?
— Rajesh Warangal (@Rajesh_Wgl) May 28, 2025
కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసిసుద్దీన్ టార్చర్ తట్టుకోలేక నేను చనిపోతున్నా అని లేక రాసి సూసైడ్ చేసుకున్న బోరుబండ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్దార్ బాయ్ గారు pic.twitter.com/u1FvPz6hQq
సర్థార్ ఆత్మహత్య..
100 గజాల స్థలంలో జీ ప్లస్ వన్ ఇంటిలో నివాసం ఉండేవారు. సర్దార్ చేసే మంచిపనులకు భార్య సమీనా తోడై నిలిచేది. ఈ దంపతులకు మూడేండ్ల వయసున్న కుమారుడు సఫాన్, ఏడాదిన్నర కుమార్తె షిఫా ఉన్నారు. అతని తల్లిదండ్రులు, తమ్ముడు కూడా ఆ ఇంట్లోనే ఉండేవారు. వచ్చే నవంబర్ నెలలో సర్దార్ తమ్ముడు మహ్మద్ ఇబ్రహీంకు వివాహం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. తమ్ముడికి పళ్లుయితే ఇల్లు సరిపోదని భావించి.. మరో రెండతస్తులు నిర్మాణం చేపట్టాడు సర్దార్. ఇంటి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తనకు డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో మూడో అంతస్థు కూల్చివేశారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో సర్థార్ మూడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
బాబా ఫసీయుద్దీన్ వేధింపుల వల్లే గోపినాథ్ కు అస్వస్థత.
— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) June 6, 2025
ఇటీవలే ఫసియుద్దీన్ వేధింపులు తాళలేక చనిపోయిన గోపినాథ్ అనుచరుడు సర్దార్.
సర్దార్ చావును సైతం వాడుకుంటూ గోపినాథ్ పై ఫసియుద్దీన్ వేధింపుల వల్లే అయన అస్వస్థతకు గురైయ్యారు. pic.twitter.com/3kgvQdohAa
mla maganti gopinath | brs mla maganti gopinath | President of Borabanda Division Minority Section | Mohammad Sardar | borabanda | hyderabad | brs-mla | latest-telugu-news